Apr 8, 2021 06:57 AM
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే. వరుస హిట్స్ తో ఈ కన్నడ కస్తూరి క్రేజ్ పీక్ లో ఉంది. ప్రభాస్ తో కలి పూజ నటించిన ‘రాధే శ్యామ్’ విడుదలకు రెడీ అవుతోంది. ఇక కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ 65వ సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ ఛాన్స్ కొట్టేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకుడు. సన్ పిక్చర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే...తాజాగా ఈ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందట. అదేంటంటే... మహేష్బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్గా పూజాహెగ్డేను తీసుకోనున్నారని సమాచారం. ఇప్పటికే పూజాతో చిత్రబృందం చర్చలు కూడా జరిపేసిందట. స్క్రిప్టు విన్న పూజా.. సానుకూలంగా స్పందించిందట. త్వరలోనే మహేష్తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. "ఎస్ఎస్ఎమ్బీ 28" వర్కింగ్ టైటిల్గా రూపొందనున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని సంస్థలు, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్ సహకారంతో నిర్మించనున్నారు. కాగా.. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు.